Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నందితాదాస్పై మండిపడ్డ దాసరి నారాయణరావు
చలన చిత్రోత్సవంలో..కార్యక్రమ నిర్వాహకురాలు, నటి నందితాదాస్ తనను నిర్మాతగా సంబోధించడం పట్ల ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మండిపడ్డారు. తెలుగువారంటే.. అందరికీ అలుసైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను నిర్మాతను కాను. దర్శకుడిని. 148 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన వాడిని. ముందు నేను దర్శకుడిని. ఆ తరువాతే నిర్మాతను. అసలు తెలుగు వారంటేనే చాలామందికి అలుసైపోయింది. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే... ఏది చూసుకున్నా ప్రతిభావంతులైన తెలుగు వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి అవార్డుల విషయం వచ్చేసరికి తెలుగు వారిని ఎక్కడో వెనుక సీట్లలో విసిరేస్తున్నారు. సినిమా రంగంలో అయితే మమ్మల్ని సెకండ్ గ్రేడ్ జనాల కింద లెక్క గడుతున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరెంతో మంది గొప్ప నటీమణులను అందించింది కూడా ఇక్కడి వారే..! ఈ చిన్నచూపు ధోరణి మారుతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. హైదరాబాద్లో 16 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం పారంభం సందర్భంగా నందితాదాస్,దాసరి గెస్ట్ లుగా అటెండయ్యారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.