Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విజృంభించిన దాసరి నారాయణరావు, ఆరు సినిమా ప్రాజెక్టుల ప్రకటన!
చివరగా బాలకృష్ణ హీరోగా 'పరమ వీర చక్ర' చిత్రాన్ని తెరకెక్కించిన దాసరి నారాయణరావు 151వ చిత్రంగా 'వడ్డి కాసుల వాడు' అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకుని మే 4వ తేదీన ఈచిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్యూన్గా పనిచేసే వ్యక్తి చుట్టూ 'వడ్డీ కాసుల వాడు' చిత్రం తిరుగుతుంది. వాస్తవానికి దగ్గరగా ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాకు ముఖ్య పాత్ర అయిన ప్యూన్గా నటించబోతున్నాడు దాసరి.
దీంతో పాటు ఓ మూడు సినిమాలను తన సొంత బ్యానర్పై నిర్మించబోతున్నట్లు దాసరి తెలిపారు. ఈ చిత్రంలో ఒకదానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించనుండగా, మరో చిత్రానికి సురేష్ కృష్ణ, మూడో చిత్రం ద్వారా కోడైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన రవి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
వీటి తర్వాత మంచు విష్ణు హీరోగా మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు దాసరి. ఈచిత్రాన్ని మోహన్ బాబు, రమేష్ వడ్డె సంయుక్తంగా నిర్మించనున్నారు. వీటి తర్వాత ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు దాసరి తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.