Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
వెంటిలేటర్పై దాసరి.. చికిత్సకు స్పందిస్తున్నారు..
కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం ఐసీయూలో చేరారు.
హైదరాబాద్: ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హైద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం ఐసీయూలో చేరారు.
అయితే మంగళవారం మధ్యాహ్నం కిమ్స్ హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్ లో దాసరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉందని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం వేళ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు.
చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తన కెరీర్ లో ..అనేక సూపర్హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి కూడా దాసరి మద్దతు పలికారు.