గూండాయిజం: మళ్లీ దాసరి హాట్ కామెంట్స్, లౌక్యంపై..
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో గూండాయిజం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 'లౌక్యం' సినిమా విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఓ అగ్ర హీరో సినిమా కోసం దాన్ని తీసివేశారని ఆరోపించారు.
అయితే, ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితులను గతంలో తానెన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో 'లక్ష్మీ రావే మాయింటికి' అనే సినిమా ఫంక్షన్లో పాల్గొన్న దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎస్పీ బాలుకు సాలూరి పురస్కారం
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు స్వర్గీయ డా. సాలూ రి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా రసమయి సంస్థ ప్రతి ఏటా అందించే సాలూరి ప్రతిభా పురస్కారాన్ని ఈ ఏడాదికిగాను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అందజేయనున్నట్టు రసమయి అధ్యక్షుడు డాక్టర్ ఎంకే రాము తెలియజేశారు.

గత 13 సంవత్సరాలుగా లలిత సంగీతానికి, చలనచిత్ర సంగీతానికి సేవలందిస్తున్న సంగీతజ్ఞులకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈనెల 25న రవీంద్రభారతిలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణ, శాంతా బ యోటెక్స్ అధినేత వరప్రసాదరెడ్డి, సాలూరి కోటి, సాలూరి వాసూరావు, సాలూరి పూర్ణచంద్రరావు పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











