Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగా ఒత్తిడి: తన వ్యాఖ్యలపై దాసరి నారాయణరావు వివరణ!
హైదరాబాద్: ఇటీవల ‘లక్ష్మీ రావే మాయింటికి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ...టాలీవుడ్లో రోజు రోజుకు రౌడీయిజం పెరిగిపోతుందన్నారు. చిన్న చిత్రాలు, వాటి నిర్మాతలు కొందరి పెద్దల రౌడీయిజానికి నలిగిపోతున్నారు. మంచి కలెక్షన్స్తో నడుస్తోన్న ‘లౌక్యం' చిత్రాన్ని ఒక పెద్ద సినిమా కోసం దాదాపు 30 థియేటర్ల నుండి తొలగించారు. ఈ విషయం తెలిసి ఎంతో బాధ వేసింది. అయితే మూడు రోజుల కంటే ఎక్కువగా ఆ చిత్రం థియేటర్లలో నిలువలేదు' అని దాసరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే దాసరి వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించేనని....ఆయన పరోక్షంగా రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం గురించి అలా అన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలతో దాసరి నారాయణరావుపై అన్ని వైపులనుండి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వారి గురించి కాదన్నారు.
బుధవారం దాసరి మీడియాతో మాట్లాడుతూ...నేను ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా పరిశ్రమ గురించే మాట్లాడతాను, వ్యక్తులను ఉద్దేశించి నేనెప్పుడూ మాట్లాడను. నా మాటలకు...మీ ఊహాగానాలు ఆపాదించి రాయొద్దు. నేను మాట్లాడిన మాటల్లోని స్పిరిట్ను తీసుకోండి. కానీ నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్లు దయచేసి వార్తలు రాయవద్దు అన్నారు.