twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి కర్టెన్ రైజర్ కి మోహన్‌ బాబు

    By Srikanya
    |

    డా.దాసరి నారాయణరావు తన 149వ చిత్రంగా రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ద్వారా 81 మంది నూతన తారలను పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన నూతన నటీనటులను పరిచయం చేయడం కోసం ఈ నెల 14న కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాత కె.రామకృష్ణప్రసాద్ చెప్పారు. డా. మోహన్ ‌బాబు నూతన తారలను పరిచయం చేస్తారని, 'మా' అధ్యక్షుడి హోదాలో మురళీమోహన్ వారిని స్వాగతిస్తారని, ఈ కార్యక్రమంలో డా.దాసరితో పాటు పలువురు చిత్రప్రముఖులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే "భారతీయుడిగా సాధించు, భారతీయుడిగా మరణించు" అనే అంశాన్ని ప్రభావశీలంగా చెప్పే కథ ఇది అని దాసరి చెప్తున్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితమిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ‌ఎమ్ ‌కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X