Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ పై... దాసరి రూ. 10.5 కోట్ల పెట్టుబడి?
హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారయణరావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఆ మధ్య ఓ సారి చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్కు డాన్సులు తప్ప నటన రాదని దాసరి విమర్శలు కూడా చేసారు. అప్పుడు అలా విమర్శలు చేసిన దాసరి నారాయణరావు....ఇప్పుడు అదే రామ్ చరణ్ పై కోట్లలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో 'నాయక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'నాయక్' నైజాం ఏరియా రైట్స్ దాసరికి చెందిన సిరి మీడియా దక్కించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం రూ. 10.5 కోట్ల భారీ మొత్తాన్ని నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం.
'నాయక్' ఆడియో నవంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డివివి దానయ్య నిర్మాత. బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, రాహుల్దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.