Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పత్రికాధినేతగా.. కేంద్రమంత్రిగా దాసరి సంచలనాలు..
ప్రముఖ దర్శకుడు, పత్రికాధినేత, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ జీవితం అనేక సంచలనాలకు వేదిక. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన అనతికాలంలో తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత
ప్రముఖ దర్శకుడు, పత్రికాధినేత, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ జీవితం అనేక సంచలనాలకు వేదిక. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన అనతికాలంలో తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఆయన ఉదయం పత్రికను స్థాపించి మరో సంచలనానికి తెరతీశారు. ఉదయం పత్రికను ప్రజల పత్రికగా మలచడంలో సఫలమయ్యాడు. ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తనదైన ముద్రను వేశారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా..
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రాజీవ్ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
కేంద్రమంత్రిగా..
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కీలక సేవలను అందింంచారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఇటీవల కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద దిక్కు కోల్పోయింద.
ఉదయం పత్రిక అధినేతగా..
1984 సంవత్సరంలో దాసరి నారాయణరావు ఉదయం దినపత్రికను ప్రారంభించారు. ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ నిర్వహణలో ప్రచురితమైంది. ఆ సమయంలో రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఏబీకే ప్రసాద్ ఎడిటర్గా సేవలందించారు. ఉదయం పత్రిక తొలుత హైదరాబాద్, విజయవాడ నుంచి వెలువడింది. ఏబీకే ప్రసాద్ తర్వాత ఉదయం పత్రికకు కే రామచంద్రమూర్తి, కెఎన్వై పతంజలి పత్రికకు ఎడిటర్గా వ్యవహరించారు.
ఆర్థిక సమస్యల కారణంగా మూతపడిన..
1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కే రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు కారణంగా ఉదయం పత్రిక మూతపడింది.