Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాసరి పద్మ అంత్యక్రియలు పూర్తి
దర్శక రత్న దాసరి నారాయణరావు సతీమణి దాసరి పద్మ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. చేవేళ్లలోని దాసరి ఫాం హౌజ్ లో ఈ అంత్య్రక్రియల పూర్తయ్యాయి. దాసరి వారసులు పద్మ చితికి నిప్పటించారు. ఈ కార్యక్రమానికి సినీ రంగంలోని పలువురు ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరైన పద్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
దాసరి సొంతగా నిర్మించిన అన్ని చిత్రాలకు పద్మ సమర్పకురాలు. శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా చిత్రాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. ఇన్నాళ్లు తనకు తోడు నీడగా, తన వెన్నుతట్టి నడిపించి, తాను ఈ స్థాయికి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన పద్మ లేక పోవడాన్ని దాసరి జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు ఇంత కాలం సీని కార్మికులకు అండగా నిలిచిన పద్మ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.