రాజేంద్రప్రసాద్కు దాసరి స్వర్ణ కంకణ పురస్కారం

సినీ దర్శకులు రేలంగి నరసింహారావు అధ్యక్షులుగా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కె.ధర్మారావు కన్వీనర్గా ఏర్పాటైన కమిటీ దాసరి నారాయణరావు పేరిట నెలకొల్పిన ఈ మొట్టమొదటి పురస్కారానికి 200 చిత్రాల నటించిన ప్రముఖ సినీ నటుడు డా.రాజేంద్రప్రసాద్ను ఎంపిక చేసారు.
ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వర్ణ కంకణాన్ని బహూకరిస్తారని తెలియజేసారు. సభాధ్యక్షులుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.విజయ్ బాబు, విశిష్ట అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ, వీరశంకర్, ఎన్.శంకర్, శివనాగేశ్వరరావు, నీలకంఠ, అల్లాణి శ్రీధర్, జి.రాంప్రసాద్, వి. ఈశ్వరరెడ్డి, రేలంగి నరసింహారావు, శ్రీమతి బి.జయ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఈశ్వర్ రావు, శివకృష్ణ, గౌతం రాజు, గుండు హనుమంతరావు, కొండ వలస తదితరులు పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 'గానభూషణ' ఆమని బృందం చే 'దాసరి సినీ సంగీత విభావరి' నిర్వహించనున్నట్లు తెలియజేసారు.


Click it and Unblock the Notifications











