గురువుగారు దాసరి నారాయణరావు గారు చెప్పారు...24 ఫ్రేమ్స్ సంస్థ ద్వారా ఆడియో క్యాసెట్ కానీ సీడీ కానీ రూ.25 లకే అమ్మి కొత్త ట్రెండ్ సృష్టించాలని...అలానే చేస్తున్నాం...కృష్ణార్జున ఆడియో క్యాసెట్ ను...సిడినీ కేవలం 25 రూపాయలకే అమ్ముతున్నామని మోహన్ బాబు చెప్పారు. బుధవారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఆడియో విడుదల అయింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ ఆడియో రూపొందింది. అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.