twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామోజీ ఆయనతో రాజీ పడ్డారా?

    By Staff
    |

    Dasari Narayana-Ramoji Rao
    దాసరి నారాయణరావు,రామోజీరావు ఇద్దరూ ఉప్పు నిప్పులా మెలుగుతారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ టీవీలో దాసరి రూపొందించిన టీవీ సీరియల్ అభిషేకం త్వరలో ప్రసారం కాబోతోందంటూ ప్రొమోస్ వస్తున్నాయి. దాంతో వారి వైరం గురించి తెలిసున్న వారంతా షాకవుతున్నారు. ఎందుకంటే రామోజీరావు తన ఛానెల్స్ లో దాసరి సినిమాలు వేస్తున్నా ఆయన పేరు వేయటానికి ఇష్టపడేవారు కాదు. అంతేకాదు సితార ఓ సంచికలో తెలుగు నాట సంచలన దర్శకులు అంటూ అందరి పేర్లూ వేసి దాసరి ప్రస్తావన తేలేదు.

    అలాగే ఈనాడు లోకూడా ఎక్కడా దాసరి గురించి న్యూస్ వచ్చేది కాదు. పొరపాటున్న ఎప్పుడన్నా వస్తే ఆ పొరపాటుకు ఆ న్యూస్ తెచ్చిన వారు మూల్యం చెల్లించాల్సిందే. అలాగే దాసరి కూడా ఉదంయం పేపరు పెట్టి రామోజీకి పోటీ ఇద్దామని చూసారు. అయితే అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఇలా ఇన్నాళ్ళూ నడిచిన వీళ్ళద్దరి కోల్డ్ వార్ హఠాత్తుగా ముగిసిందా అనే సందేహం అందరికీ వస్తోంది. లేదా పేరున్న వాళ్ళ సీరియల్స్ కావాలి కాబట్టే దాసరి సీరియల్ ఏక్సెప్ట్ చేసారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదైమైనా వీళ్ళిద్దరూ కలవటం వెనక ఏ ఉద్దేశం ఉన్నా ప్రజలుకు అందే ఫలితం మాత్రం చాలా భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X