Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవికి కూతురు జాహ్నవి రాసిన లేఖ... చదివితే మీకూ కన్నీళ్లు వస్తాయి!
Recommended Video
శ్రీదేవి మరణం దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఇండియన్ సినీ పరిశ్రమలో లెజెండరీ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే దుబాయ్ హోటల్ లో అత్యంత దయనీయ స్థితిలో మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి అసలు కారణం ఏమిటీ అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఆమె మరణించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది.
తల్లి మరణంతో కూతుళ్లు..
తల్లి మరణంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఇకపై తాము అమ్మ లేకుండానే జీవించాలనే విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
శ్రీదేవికి కూతురు జాహ్నవి కపూర్ రాసిన లేఖ
కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి కపూర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఫెమినా మేగజైన్ ఎడిటర్ తాన్యా చైతన్యా తాజాగా బయట పెట్టారు. ఈ లేఖ చదివిని ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతున్నారు.
తన కూతుళ్ల గురించి శ్రీదేవి...
గతేడాది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూతుళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఖుషి కపూర్ తండ్రి బోనీకి చాలా క్లోజ్ గా ఉంటుందని, జాహ్నవి తనతో ఎక్కువ క్లోజ్గా ఉంటుందని తెలిపారు. ఇద్దరూ ఇండిపెండెంటుగా ఉంటారు, నేను లేకుండా అయితే జాహ్నవి అస్సలు ఉండలేదు అని.... వెల్లడించారు.
శ్రీదేవి అంత్యక్రియలు
శ్రీదేవి భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. మంగళవారం రాత్రి దుబాయ్ నుండి శ్రీదేవి భౌతిక కాయం ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లోని ఆమె స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికే చేరుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు.
ప్రజల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద
బుధవారం ఉదయం శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసం నుంచి సెలబ్రేషన్స్ క్లబ్ కు తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు.