Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూరి రెమ్యూనరేషన్ లొల్లి...దానయ్యకు డెడ్లైన్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత డివివి దానయ్య మధ్య డబ్బుల విషయంలో తగాదా ఏర్పడిన విషయం తెలిసిందే. నిర్మాత తనకు ఇవ్వాల్సిన రూ. 4.5 కోట్లు ఎగ్గొట్టారని పూరి దర్శకుల సంఘంలో ఫిర్యాదు కూడా చేసారు. సన్నిహితుల సలహాతో పూరి ఆ ఫిర్యాదును ఉపసంహించుకోవడం కూడా జరిగింది.
అయితే తాజాగా దర్శకులు సంఘం నిర్మాత దానయ్యకు డెడ్ లైన్ విధించింది. సినిమా విడుదలకు ముందే పూరి రెమ్యూనరేషన్ సెటిల్ చెయ్యాలని ఆల్టిమేటం జారీ చేస్తూ...బుధవారం వరకు గడువు విధించారు. లేకుంటే నిర్మాత దానయ్యకు దర్శకుల సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించారు. పూరి ఫిర్యాదు ఉప సంహరించుకున్నా...దర్శకుల సంఘం ఇప్పుడు ఇలా ఫైర్ కావడానికి కారణం దర్శకుల సంఘానికి దానయ్య చెల్లించాల్సిన కొన్ని టాక్స్ చెల్లింపులు చెల్లించక పోవడమే ప్రధాన కారణం.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.
ప్రకాష్రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.