Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూ ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి: నిర్వాహకులదే తప్పా?
హైదరాబాద్: బాద్షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భందా జరిగిన తొక్కిసలాటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతికి పోలీసులు నిర్వాహకులను తప్పు పడుతున్నారు. కార్యక్రమ నిర్వహణకు ఆ వేదిక వద్దని తాము చెప్పినా సినియా యూనిట్ వినలేదని పోలీసులు అంటున్నారు. పెద్ద యెత్తున వచ్చే అభిమానులను కట్టడి చేయడం ఈ వేదిక వద్ద కుదరదని తాము చెప్పినా వారు వినలేదని మాదాపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ టి. యోగానంద్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
అభిమానులను తగిన రీతిలో కట్టడి చేయడానికి తమ వాలంటీర్లు ఉన్నారని, తాము పరిస్థితిని అదుపు చేయగలమని, తమకు అక్కడే అనుమతి ఇవ్వాలని సినిమా యూనిట్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు ఆయన తెలిపారు. దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఈ వేదిక వద్ద ఇదివరకు కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. ఆదివారం నాడు మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో వరంగల్లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని కొండాపూర్ ఆస్పత్రిలో ఉంచారు.