Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
చంపేస్తాం.. బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు డీ గ్యాంగ్ వార్నింగ్
ప్రముఖ నటి అలియాభట్, ఆమె కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు.
ప్రముఖ నటి అలియాభట్, ఆమె కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు, అలియా తండ్రి మహేశ్ భట్ ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం మహేశ్ భట్ కుటుంబాన్ని మట్టుబెడుతామని బెదిరించిన పలువురి గతంలో అరెస్ట్ చేశారు.
50 లక్షలు డిపాజిట్ చేయాలని హెచ్చరిక
అలియాభట్
కుటుంబాన్ని
మరోసారి
అగంతకులు
ఫోన్లో
బెదిరించారు.
రూ.50
లక్షలు
లక్నోలోని
బ్యాంక్లో
డిపాజిట్
చేయాలని
హెచ్చరించారు.
లేకపోతే
అలియాను,
ఆమె
తల్లి
సోని
రజ్దాన్ను
చంపివేస్తామని
బెదిరింపులకు
పాల్పడ్డారు.
ఈ
వ్యవహారాన్ని
తొలుత
నకిలీ
ఫోన్
కాల్గా
భావించారు.
కానీ
ఆ
తర్వాత
వాట్సప్
మెసేజ్
కూడా
రావడంతో
దీనిని
సీరియస్గా
తీసుకొన్నారు.
బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు హెచ్చరిక
వాట్సప్ మేసెజ్ ఉన్న ప్రకారం.. ‘మేం చెప్పిన డబ్బును బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే కొన్ని రౌండ్ల బుల్లెట్లు నీ కూతురు అలియా, భార్య సోని దేహంలోకి దూసుకెళ్తాయి' అని బెదిరించారు.
జుహు పోలీస్స్టేషన్లో భట్ ఫిర్యాదు
దాంతో ఆందోళనకు గురైన భట్ ఫ్యామిలీ జుహు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 387 ప్రకారం కేసు నమోదు చేశారు. ముంబై పోలీసుల భట్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. భట్ నివాసం వద్ద భారీ భద్రతను కల్పించారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును యాంటీ ఎక్స్టార్షన్ సెల్కు బదిలీ చేశారు.
రెండేండ్ల క్రితం భట్ కుటుంబానికి ఇలానే..
రెండేండ్ల క్రితం ఈ విధంగానే బెదిరించిన 13 మంది దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో మహేశ్భట్ కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు చేసిన కుట్రను భగ్నం చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఫోన్ బెదిరింపులు రావడం బాలీవుడ్ ప్రముఖులను ఆందోళనకు గురిచేస్తున్నది.