Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుగు పరిశ్రమ షాక్.. 10 రోజుల్లో 6 మరణాలు
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ఈ పదిరోజుల్లో 6 మరణాలు సంభవిచటంతో పలువులు సినీ ప్రముఖలు విషాదంలోనూ, ఆలోచనలోనూ పడిపోయారు. ఆ మధ్యన వరసగా హాస్య నటులు మరణాలు తెలుగు పరిశ్రమలో జరిగి అందరినీ కలవరపరిచాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్దితి ఏర్పడింది.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో ఈ విషాదం ప్రారంభమైంది. అదేరోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి (జగదేక వీరుడు అతిలోక సుందరి ఫేమ్) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం బాధ కలిగించింది.
తర్వాత మరో సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూంలో జారిపడి అపస్మారక స్థితిలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు, పలువురు స్టార్ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు గత శనివారం అనారోగ్యంతో మరణించారు.
ఆ విషాదం నుంచి తేరుకునే ముందే.. విలక్షణ నటుడు, హీరో రంగనాథ్ ఆత్మహత్యతో చేసుకున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే టీవీ రంగానికి చెందిన మరో కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పట్లో టీవీలో పాపుల్ డాన్స్ షో 'ఆట'లో డాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించాడు. భరత్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటీ కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆట ఫ్రోగ్రాంలో శ్రీవిద్యతో కలసి అతను చేసిన డాన్స్ అప్పట్లో ఆట ఫ్రోగ్రామ్ కే హైలెట్ అయ్యేలా ఉండేదని తోటి కళాకారులు అంటున్నారు.