Don't Miss!
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం
వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఇక మంచు లక్ష్మీ 'ఝుమ్మంది నాదం' తరవాత నిర్మించే చిత్రం ఇది. ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అంటున్నారు.