Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం
వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఇక మంచు లక్ష్మీ 'ఝుమ్మంది నాదం' తరవాత నిర్మించే చిత్రం ఇది. ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అంటున్నారు.