ప్రభాస్ 'రెబెల్' లో అల్లు అర్జున్ హీరోయిన్
అల్లు అర్జున్ "వేదం" చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ప్రభాస్ సరసన రెబెల్ లో సెకెండ్ హీరోయిన్ బుక్కయింది. ఈ చిత్రం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోంది. మొదటి హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. జె.భగవాన్, జె.పుల్లారావులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక దీక్షాసేధ్ తాజాగా వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా...ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
More from Filmibeat
దీక్షాసేథ్ లక్ష్మీ ప్రసన్న మనోజ్ కుమార్ షీనా బిందాస్ deeksha seth lakshmi prasanna manoj kumar sheena bindaas raghavendra rao


Click it and Unblock the Notifications











