Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దీపికా పదుకోన్ మరో ఘనత.. 11 ఏళ్ల తర్వాత..
Recommended Video
అందాల తార దీపికా పదుకోన్ మరో ఘనతను సొంతం చేసుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో కూడిన ప్రభావంతుల జాబితాలో దీపికా చోటు దక్కించుకున్నారు. వెండితెరకు పరిచయమైన 11 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం గమనార్హం.
2007లో ఫర్హాఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం చిత్రంలో షారుక్ ఖాన్ పక్కన నటించడం ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించింది. తొలి చిత్రమే బ్లాక్బస్టర్ కావడంతో దీపికా పదుకొన్కు ఎదురే లేకుండా పోయింది. అలాగే 2012లో దీపిక నటించిన కాక్టెయిల్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, గోలియోంకి రాస్లీలా, పీకు, తమాషా, పద్మావత్ చిత్రాలతో అగ్రతారగా మారింది.
గతేడాది ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. హాలీవుడ్ నటుడు విన్ డిజిల్ పక్కన నటించి మెప్పించింది. ప్రస్తుతం అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో దీపికా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రం కోసం దీపికా పదుకోన్ సుమారు రూ 12 కోట్ల పారితోషికాన్ని తీసుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ల సరసన దీపిక నటించిన విషయం తెలిసిందే.