Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ మూవీపై రూమర్లు.. ఆ హీరోయిన్తో అంటూ గుప్పుమంటున్న గాసిప్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో సినిమా అంటూ ప్రకటన వెలువడగానే మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ సినిమా ఏడాది చివర్లో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. అయిేత ఈ సినిమాలోని నటీనటుల గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొంటున్నది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్లో హల్చల్ చేస్తున్నది. అదేమిటంటే..
దీపిక పదుకోన్తో చర్చలు
ప్రభాస్తో రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ కోసం క్రేజీ హీరోయిన్ల పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం అందాల భామ దీపిక పదుకోన్ను సంప్రదించారనే వార్త మీడియా సర్కిళ్లలో గుప్పుమంటున్నది. ఈ కథలో పాత్ర తీరుతెన్నులను కూడా దీపికకు వివరించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రియాంకతో నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
దీపిక కాకుంటే ప్రియాంక చోప్రా
ప్రభాస్ మూవీలో దీపికా పదుకోన్ నటించడానికి ఇష్టపడకపోతే ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాతో సంప్రదింపులు జరుపాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. దక్షిణాది చిత్రాలకు ఈ ఇద్దరు హీరోయిన్లు ఓటేస్తారా? అనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
దక్షిణాదిలో దీపిక పదుకోన్
కాగా, దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. దక్షిణాది చిత్రాల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. రజనీకాంత్తో కలిసి కొచ్చడయాన్లో నటించింది. అయితే కొచ్చడయాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెకు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. ఆ తర్వాత మళ్లీ దక్షిణాదివైపు చూసిన దాఖలాలు కూడా లేవు.
ప్యాన్ వరల్డ్ మూవీగా
ప్రభాస్,
నాగ్
అశ్విన్
కాంబినేషన్లో
ప్యాన్
వరల్డ్
మూవీగా
రూపుదిద్దకొనే
సినిమాను
ప్రముఖ
సినీ
నిర్మాణ
సంస్థ
వైజయంతీ
మూవీస్
ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కించే
పనిలో
ఉంది.
తమ
సంస్థ
స్థాపించి
50
ఏళ్లు
పూర్తయిన
సందర్బంగా
ఈ
సినిమాను
హాలీవుడ్
రేంజ్లో
నిర్మించడానికి
కసరత్తు
చేస్తున్నారు.