Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
గెస్ట్ హౌస్లో సీక్రెట్గా కలుసుకొంటున్న ఇద్దరు స్టార్స్..!
దీపికా పదుకొనే సిద్దార్థ మాల్యాల మధ్య ఎఫైర్ గురించి తెలయనిదెవరికి? ఈ విషయం ఇంగ్లాండ్ క్రికెటర్ కెవన్ పీటర్ సన్కి తెలిసిపోయింది. ఏకంగా పీటర్ సన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా, దీపికా సిద్దార్థల ఎఫైర్ గురించి రాసేసరికి, దీపిక ఒక్కసారిగా సిగ్గుతో తెగ ఇబ్బంది పడిపోయిందట. ఇంకా ఈ ఎఫైర్ ని ఓపెన్గా కొనసాగించడం మంచిదికాదని డిసైడ్ అయిన దీపిక, పబ్లిక్గా సిద్దార్థని కలవడం మానేసిందని బాలీవుడ్ లో గుసగుసలు విన్సిస్తున్నాయి.
గత వారం పది రోజులుగా మీడియాకి సిద్దార్థ దీపిక జంటగా ఎక్కడా దొరక్కపోవడం గమనార్హం. అయితే చాటుమాటుగా ఇద్దరూ కలుసుకుంటున్నారనీ, ప్రేమలో మునిగి తేలిసోతున్నారనీ, సిద్దార్థ స్నేహితుడికి చెందిన పబ్లో ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారనేది బాలీవుడ్ లో తాజాగా విన్సిస్తోన్న గాసిప్. ముంబై శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లోనూ, బెంగళూరులో ఓ గెస్ట్ హౌస్ లోనూ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటున్నారట కూడా మీడియాకి భయపడిందో ఏమోగానీ, దీపిక ఇలా చాటుమాటుగా కలుస్తున్న వ్యవహారం ఎక్కడి వరకూ దారితీస్తుందో వేచి చూడాల్సిందే.