Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'బాహుబలి' లో దేవకట్టా రాసిన డైలాగు ఇదే
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా టైటిల్స్ లో దర్శకుడు దేవా కట్టకు థాంక్స్ చెబుతూ కూడా ఓ టైటిల్ వేయించాడు దర్శకుడు రాజమౌళి. దానికి కాణం ఈ సినిమా కోసం దేవా కట్ట కొన్ని డైలాగ్స్ రాసిచ్చారనే సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్లో ఫ్రభాస్ చెప్పే డైలాగులు ఈయనే రాసాడంటూ వార్తలు వచ్చాయి. ‘బాహుబలి' కోసం దేవా కట్ట కాంట్రిబ్యూషన్ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్ ఇస్తూ థాంక్స్ కార్డు వేయించాడు. దీనిపై దేవా కట్ట సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఇంతకీ దేవకట్టా రాసిన డైలాగు ఏమిటీ అంటే...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
"నాతో వచ్చేదెవరు...నాతో చచ్చేదెవరు...చావుని దాటుకుని నాతో బ్రతికేదెవరు !"
క్లైమాక్స్ లో తన సైనికులను ఉద్దేసించి ఇన్సిప్రేషన్ గా చెప్పే ఈ అద్బుతమైన డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రమ్యకృష్ణకు సైతం కొన్ని డైలాగులు ఆయన రాసారు.
దేవకట్టా ట్వీట్ చేస్తూ... ‘బాహుబలిలో వార్ సమయంలో ప్రభాస్ చెప్పే స్పీచులు కేవలం కొన్ని పదాలు మాత్రమే నేను రాసాను. రాజమౌళి సృష్టించిన బాహుబలి సముద్రంలో నేను చేసింది నీటి చుక్కంత మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్ కార్డు వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం' అంటూ దేవా కట్ట చెప్పుకొచ్చారు.