Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
యాక్షన్ హీరోతో...దేవా కట్ట నెక్స్ట్ చిత్రం ఖరారు
దేవకట్టా ట్వీట్ లో ... "నా తదపరి చిత్రం గోపీచంద్ తో ఉంటుంది. అది ఓ ఓ యాక్షన్ ఎంటర్టైనర్, మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ", అని ట్వీట్ చేసారు. అలాగే... 'ఆటోనగర్ సూర్య' విడుదల గురించి చెప్తూ.. " మీ అందరి లాగే నేను కూడా ఆటోనగర్ సూర్య విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ", అన్నారు.
కొంతకాలం క్రితం దేవా కట్టా... 'అబద్దానికే అంత దమ్ముంటే, నిజానికి ఎంత దమ్ము ఉండాలి'.. అనే కాన్సెప్ట్ తో ఓ చిత్రం చేస్తానని ట్వీట్ చేసారు. అప్పట్లో నానితో ఆ చిత్రం అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు గోపీచంద్ తో చిత్రం అని ఖరారు చేయటంతో అదే థీమ్ తో గోపీచంద్ చిత్రమే తెరకెక్కుతుందేమో అంటున్నారు.
ఇక గోపీచంద్ విషయానికి వస్తే... తాప్సీ హీరోయిన్ గా.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'జాక్పాట్' అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి 'సాహసం ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిత్తరం పూర్తిగా ఎండ్వెంచర్స్ తో నడవటంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తయారవుతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మైంట్స్ సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామోజీ ఫిల్మ్సిటీ, లడక్, రాజస్థాన్, జోర్డాన్లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.