ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘దేవస్థానం’ మూవీ
అది మాత్రమే కాదు..'వెన్నముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో మహర్షి రాసిన పుస్తకాలను కూడా ఈ సభల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వీటిలో 'వెన్నముద్దలు' ఎనిమిదో ముద్రకావడం విశేషం.
ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ 'ఈ నెల 28న దేవస్థానం చిత్రం ప్రదర్శించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువారు ఈ చిత్రాన్ని చూసి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగాగా కోరుకుంటున్నాను.
ఈ సినిమాతో పాటు తెలుగు మహా సభల్లో నా పుస్తకాలకు కూడా స్థానం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జనార్ధన మహర్షి 'పవిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ కథానాయికగా ఓ బలమైన కథాంశంతో మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications












