twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘దేవస్థానం’ మూవీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జనార్ధన మహర్షి 'దేవస్థానం' చిత్రాన్ని దేశ, విదేశీయులు చూడబోతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ అచ్చ తెలుగు సినిమాని శక్తివంతమైన కథాంశంతో జనార్ధన మహర్షి తెరకెక్కించారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో ఈ నెల 28న ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

    అది మాత్రమే కాదు..'వెన్నముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో మహర్షి రాసిన పుస్తకాలను కూడా ఈ సభల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వీటిలో 'వెన్నముద్దలు' ఎనిమిదో ముద్రకావడం విశేషం.

    ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ 'ఈ నెల 28న దేవస్థానం చిత్రం ప్రదర్శించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువారు ఈ చిత్రాన్ని చూసి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగాగా కోరుకుంటున్నాను.

    ఈ సినిమాతో పాటు తెలుగు మహా సభల్లో నా పుస్తకాలకు కూడా స్థానం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జనార్ధన మహర్షి 'పవిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ కథానాయికగా ఓ బలమైన కథాంశంతో మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    English summary
    'Devasthanam' show in ' wold Telugu Maha Sabhalu'. Popular writer Janardhan Maharshi is directing this film under Sarve Jana Sukhino Bhavanthu Films. Kalatapasvi K.Viswanath and S.P.Balu are acted as the main leads in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X