Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంతకం పెట్టాక చెబుతా... దేవిశ్రీ ప్రసాద్
ఇప్పుడు మళ్లీ ఓ మంచి అవకాశం వచ్చింది. చేయాలా? వద్దా అని ఆలోచిస్తున్నా. సంతకం పెట్టిన తరవాత ఆ కబురు చెబుతా'' అంటున్నారు దేవిశ్రీ.ప్రసాద్. చిన్న వయస్సులోనే స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గా ఎదిగిన దేవికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అయితే ఆల్రెడీ తెలుగు,తమిళంలో బిజీగా ఉండటంతో ఏదీ కమిట్ కావటం లేదు. ఆ విషయం చెప్తూ పై విధంగా స్పందించారు. బాలీవుడ్ ఆఫర్స్ రావటానికి కారణం హిందీలో ఈ మధ్య దేవి ఇచ్చిన ట్యూన్ సూపర్ హిట్ కావటం. సల్మాన్ఖాన్ 'రెడీ' సినిమా కోసం దేవి కూర్చిన 'ఢింకచక.. ఢింకచక' సూపర్ హిట్ అవటం అతనికి బాలీవుడ్ కాలింగ్ కు కారణమైంది.
అంతేగాక 'రెడీ' . సినిమా పాటల ఫంక్షన్ లో దేవిశ్రీ పోగ్రాం కూడా ఇచ్చారు. దాంతో బాలీవుడ్ దర్శకుల దృష్టి ఈ యువ సంగీత దర్సకుడు మీద పడింది. 'ఢింకచక..' పాట తరవాత దేవిశ్రీకి ముంబై నుంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ ప్రవేశంపై కంగారు పడదలుచుకోలేదు. ఈ విషయం చెప్తూ...'' రెడీ పాటకు ముందు నుంచి కూడా కొంతమంది బాలీవుడ్ దర్శకులు నన్ను సంప్రదించారు. అయితే హీరో, నిర్మాణ సంస్థ... ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. పైగా తెలుగు, తమిళ చిత్రాలతో తీరిక దొరకలేదు. ఓ హిందీ సినిమా చేయాలనే కోరిక నాకూ ఉంది అన్నారు. అంటే త్వరలనే దేవి పూర్తి స్దాయి బాలీవుడ్ సినిమాకు పనిచేస్తారన్నమాట.