Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
వివాదం: దేవిశ్రీ ప్రసాద్ వల్ల మనోళ్లు నష్టపోతున్నారా?!
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తూ ఫాంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దేవిశ్రీ ప్రసాద్ వ్యవహారం ఇపుడు వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సినీ మ్యూజీషియన్స్ యూనియన్లో మెంబర్ షిప్ తీసుకోవడానికి దేవిశ్రీ ప్రసాద్ నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో యూనియన్ అతనిపై చర్య తీసుకునే యోచనలో ఉంది.
దేవిశ్రీతో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లయిన తమన్, కోటి, కీరవాణి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్ జనరల్ బాడీ మీటింగులో వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 2వ ఆదివారం ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.
వీరు తెలుగు సినిమాలకు పని చేస్తూ....తమిళనాడులో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల ఇక్కడి వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వారు ఒకసారి ఏపీ యూనియన్లో మెంబర్ షిప్ తీసుకుంటే....రికార్డింగ్స్ హైదరాబాద్లోనే చేయాల్సి ఉంటుంది. ఇతర విషయాల్లో కూడా ఏపీ మ్యూజీషియన్స్ యూనియన్లో సభ్యత్వం ఉండే వారి సేవలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగుతో పాటు ఇతర బాషా చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఏపీ యూనియన్లో సభ్యత్వం తీసుకుంటే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే సందేహంలో పడ్డారు. ఈ కారణంగానే వారు సభ్యత్వం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా......యూనియన్ మెంబర్ షిప్ తీసుకుంటే తెలుగు వారికి ఎంతో కొంత మేలు జరుగుతుందనేది సత్యం. యూనియన్ వారు చేస్తున్న వాదనలోనూ న్యాయం ఉంది.