Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అఫీషియల్ : జంజీర్ చిత్రానికి దేవిశ్రీ ఖరారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'జంజీర్'. ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ సంగీత దర్శకుడు యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ విషయం కేవలం ఓ ఊహాజనిత సమాచారం. తాజా ఈ విషయం అఫీషియల్ గా ఖరారైంది.
దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఉన్న సంగీత దర్శకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆడియో అందించారు. దేవిశ్రీ అందించిన 'రింగ రింగ' ట్యూన్తో పాటు పలు ట్యూన్లను బాలీవుడ్ దర్శక తమ సినిమాల్లో వాడుకున్నారంటే...దేవిశ్రీ సంగీతానికి అక్కడ ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' చిత్రానికి రీమేక్గా రూపొందనున్న చిత్రం ద్వారా రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్కు యాంగ్రీ యంగ్మెన్గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజాగా రీమేక్ అవుతున్న జంజీర్ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానన్నారు. జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రొమాన్స్ చేస్తోంది.