twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల లిస్టులో చేరిన దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్లో తొలిసారిగా బాలయ్య సినిమాకు పని చేయబోతున్నారు. 'సింహ' తర్వాత బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

    వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జరిగింది. దేవుడి చిత్రపాలపై చిత్రీకరించిన ముమూర్తపు షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటిలు కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు బోయపాటి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

    సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.

    ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దాన్ని బాలయ్య కోసం ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'జయసింహ' టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    For the first time in his career Devi Sri Prasad would compose tunes for Nandamuri Balakrishna's film. The action entertainer, to be directed by Boyapati Seenu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X