Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేవి, ఛార్మి సయ్యాట నిజమే!?
ఛార్మి సరసన దేవిశ్రీ ప్రసాద్ కనిపించనున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు రావటం వాటిని కొట్టిపరేయటం జరిగిన సంగతే. అయితే సయ్యాట పేరుతో రెడీ అవుతున్న ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని విశ్వసనీయసమాచారం. అయితే అతను ఈ చిత్రంలో హీరోనా,కాదా అన్నది మాత్రం తెలియనివ్వటం లేదు. ఇక దీనికి తోడు ఛార్మి, దేవిల కాంబినేషన్లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్వేశారు.
అక్కడ మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్ జరగాల్సి ఉంది. అయితే ప్రకృతి సహకరించకపోవటంతో షూటింగ్ వాయిదాపడింది. ఇక ఈ చిత్రంలో ఛార్మి కి జోడిగా అజయ్ (ఆ ఒక్కడు హీరో) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ గా పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఛార్మి నటించిన 16 డేస్, కావ్యాస్ డైరీ, ఫ్లాఫ్ కావటం, మాయగాడు రిలీజ్ లేటవటంతో ఈ చిత్రంపై పెద్దగా క్రేజ్ రావటం లేదు.