Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
దేవి, ఛార్మి సయ్యాట నిజమే!?
ఛార్మి సరసన దేవిశ్రీ ప్రసాద్ కనిపించనున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు రావటం వాటిని కొట్టిపరేయటం జరిగిన సంగతే. అయితే సయ్యాట పేరుతో రెడీ అవుతున్న ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని విశ్వసనీయసమాచారం. అయితే అతను ఈ చిత్రంలో హీరోనా,కాదా అన్నది మాత్రం తెలియనివ్వటం లేదు. ఇక దీనికి తోడు ఛార్మి, దేవిల కాంబినేషన్లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్వేశారు.
అక్కడ మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్ జరగాల్సి ఉంది. అయితే ప్రకృతి సహకరించకపోవటంతో షూటింగ్ వాయిదాపడింది. ఇక ఈ చిత్రంలో ఛార్మి కి జోడిగా అజయ్ (ఆ ఒక్కడు హీరో) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ గా పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఛార్మి నటించిన 16 డేస్, కావ్యాస్ డైరీ, ఫ్లాఫ్ కావటం, మాయగాడు రిలీజ్ లేటవటంతో ఈ చిత్రంపై పెద్దగా క్రేజ్ రావటం లేదు.