Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దేవి, ఛార్మి సయ్యాట నిజమే!?
ఛార్మి సరసన దేవిశ్రీ ప్రసాద్ కనిపించనున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు రావటం వాటిని కొట్టిపరేయటం జరిగిన సంగతే. అయితే సయ్యాట పేరుతో రెడీ అవుతున్న ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని విశ్వసనీయసమాచారం. అయితే అతను ఈ చిత్రంలో హీరోనా,కాదా అన్నది మాత్రం తెలియనివ్వటం లేదు. ఇక దీనికి తోడు ఛార్మి, దేవిల కాంబినేషన్లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్వేశారు.
అక్కడ మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్ జరగాల్సి ఉంది. అయితే ప్రకృతి సహకరించకపోవటంతో షూటింగ్ వాయిదాపడింది. ఇక ఈ చిత్రంలో ఛార్మి కి జోడిగా అజయ్ (ఆ ఒక్కడు హీరో) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ గా పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఛార్మి నటించిన 16 డేస్, కావ్యాస్ డైరీ, ఫ్లాఫ్ కావటం, మాయగాడు రిలీజ్ లేటవటంతో ఈ చిత్రంపై పెద్దగా క్రేజ్ రావటం లేదు.