Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ చిత్రానికి నేను చేయటం లేదు: దేవిశ్రీ ప్రసాద్
హైదారాబాద్: రామ్ చరణ్ తాజా చిత్రం 'తుఫాన్' సంగీతంపై ఉన్న కన్ఫూజన్స్ తొలిగిపోయాయి. తాను 'తుఫాన్' లేదా 'జంజీర్' చిత్రానికి సంగీతం ఇవ్వలేదని దేవి ట్వీట్ చేసారు. చాలా మంది తనని పదే పదే ఇదే ప్రశ్న అడటంతో క్లారిఫై చెయ్యక తప్పలేదని చెప్పారు. అనూ మాలిక్, మీట్ బ్రదర్శ్, కాధరిన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొదట్లో దేవినే ఈ చిత్రానికి సంగీతం అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అమితాబ్ హీరోగా 1973లో వచ్చిన 'జంజీర్'చిత్రం హిట్ కావడంతో... అదే సినిమాను ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. సమ్మర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమితాబ్ అభిమానుల కోరిక మేరకు 'జంజీర్' చిత్రంలో ఆయనతో గెస్ట్ రోల్ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ జంజీర్ వరకు మాత్రమే అమితాబ్ గెస్ట్ రోల్ పరిమితమని, తెలుగు వెర్షన్ 'తుఫాన్' లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.