twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకేసారి ముగ్గురు మెగా హీరోలకు మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ..!

    By Sindhu
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాకు, అల్లు అర్జున్ హిరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించే చిత్రానికి కూడా మ్యూజిక్ డైరక్టర్ గా ఎంపిక అవ్వడంతో, ఒకేసారి ముగ్గురు మెగా హీరోలకు మ్యూజిక్ అందిస్తున్నట్టుగా అయ్యింది. వచ్చే సంవత్సరం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రారంభం కాబోయే మెగాస్టార్ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాదే అయితే మాత్రం రికార్డే.

    దిల్ రాజు నిర్మించే చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దానితో ఎన్టీఅర్ 'బృందావనం' ద్వారా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ కొట్టేసాడు.

    ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు ప్రస్తుతం గోవాలో జరుగుతున్నాయి. దిల్‌ రాజు సంస్థలో చరణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. అలాగే పైడిపల్లి వంశీతో ఆయన పనిచేయడం కూడా ఇదే ప్రథమం. ఇక చరణ్ సినిమాకు దేవిశ్రీ సంగీతాన్నందించడం కూడా ఈ సినిమాతోనే జరుగుతోంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. ఇందులో చరణ్‌ కి జంటగా సమంత నటించనున్నారని సమాచారం.

    English summary
    For the first time, youth sensation Devi Sri Prasad is scoring music for Ram Charan's movie. Though Devi Sri Prasad gave musical hits to Chiranjeevi, Pawan Kalyan and Allu Arjun, he is scoring songs for Charan for the first time for a movie to be directed by Vamsi Paidipalli of Brindavanam fame and produced by Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X