Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అయ్యో..'దేవుడు చేసిన మనుషులు'మళ్లీ మారిపోయింది
పూరీ జగన్నాధ్,రవితేజ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం ఇప్పటికి పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్జచుకుంది. తాజాగా ఆగస్టు 15 న ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మరి కొద్ది రోజుల్లో అపీషియల్ గా ప్రకటన రానుంది. బిజినెస్ సమస్యల వల్ల లేక ధియోటర్స్ సమస్యల వలనో ఈ రిలీజ్ డేట్స్ ఇలా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఈగ సూపర్ హిట్ అవటం కూడా ఈ విడుదల తేదీ ఛేంజ్ కి కారణం కావచ్చని తెలుస్తోంది.
'దేవుడు చేసిన మనుషులు'ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా గురించి ఆయన తెలియజేస్తూ "ఇటీవల విడుదలైన ఆడియో సూపర్ హిట్టయింది. సినిమా విడుదలకు ముందే అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ తెలుపుతూ...పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అన్నారు.
సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ "పాటల్ని ఇంత పెద్ద హిట్చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. పూరి జగన్నాథ్తో చేస్తున్న ఈ సినిమా నా కెరీర్కి ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి'' అన్నారు. ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతి రాణా, మానస, గాబ్రియేల్ బర్తాంతే తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేశ్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.