Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హైదరాబాద్లో ధనుష్ ‘కొలవెరి’ లైవ్ షో
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'త్రీ'(కొలవెరి ఉప శీర్షిక) తెలుగు అనువాదపు హక్కులను నిర్మాత నట్టి కుమార్ కొనుగులో చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళంలో నిర్మించారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.... నా మీద నమ్మకంతో తెలుగు అనువాదపు హక్కులను ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ నెల 20న తెలుగు, తమిళ చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్లో భారీగా ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన'కొలవెరి' పాటను హీరో ధనుష్ స్వయంగా వేదికపై పాటను పాడతారు. ఈ పాట తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. ధనుష్ అందించిన సాహిత్యం, అతని గాత్రం ఈ పాటను బాగా సూటయ్యాడు. కొలవెరి పాట సినిమా అంచనాలను పెంచింది. యువతను, ఫ్యామిలీని మెప్పించే విధంగా సినిమా అవుతుంది. రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రముఖులు ఆడియో వేడుకలో పాల్గొంటారు. ఈ నెల 30న చిత్రం తెలుగు, తమిళంలో ఒకే సారి సినిమా విడుదలవుతుందని తెలిపారు.