Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్-ఐశ్వర్య.. నవ్వుతూ ఫొటో.. మళ్లీ కలిసిపోయారా?
కోలీవుడ్ స్టార్ కపుల్గా 18 ఏళ్లు కలిసున్నారు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎప్పటికైనా వీళ్లిద్దరూ మళ్లీ కలవకపోతారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఉన్న ధనుష్ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక ఇప్పటివరకు ఎక్కడా ధనుష్-ఐశ్వర్య కలిసిన సందర్భాలు లేవు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఆశ్చర్యపరిచారు.
ధనుష్.. కోలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకరు. ఐశ్వర్య రజనీకాంత్.. సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తెగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ధనుష్-ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉండేది.
పోస్ట్తో షాక్..
18 ఏళ్లపాటు వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్-ఐశ్వర్య అనూహ్యంగా జనవరి 18, 2022న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు షాక్కు గురయ్యేలా చేశారు. 'భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచారు.
ఒక్కటవుతారని..
ఈ వార్తతో సూపర్ స్టార్ రజనీ కాంత్, ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్ మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు.
ధనుష్ పేరు తొలగించి..
కానీ, అలా జరగలేదు. ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఉన్న ధనుష్ పేరు తొలగించి రజనీకాంత్ పేరును చేర్చి ఐశ్వర్య ఇంకా షాక్ ఇచ్చింది. విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి మళ్లీ వాళ్లిద్దరు కలిసిన దాఖలాలు లేవు.
హాజరవ్వని ఐశ్వర్య..
ఒకసారి మాత్రం తన ఇద్దరు కుమారులను వెంట వేసుకుని ధనుష్ ఓసారి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరికి వెళ్లాడు. కానీ, అప్పుడు వారి వెంట ఐశ్వర్య రజనీకాంత్ లేదు. అయితే తాజాగా, తొలిసారిగా విడిపోయిన తర్వాత ధనుష్-ఐశ్వర్య కలిసి కనిపించారు.
ధనుష్-ఐశ్వర్య కలిసి హాజరు..
ధనుష్-ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ దంపతులు ఇద్దరు హాజరయ్యారు. 'ఈ రోజు చాలా బాగా ప్రారంభమైంది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు' అని సోమవారం అంటే ఆగస్టు 22న తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టింది ఐశ్వర్య.
నవ్వుతూ ధనుష్-ఐశ్వర్య..
ఈ
పోస్ట్లో
ఫ్యామిలీ
పిక్ను
కూడా
తన
ఇన్స్టాగ్రామ్
స్టోరీలో
పెట్టింది.
ఈ
ఫొటోలో
తమ
పిల్లలతో
ధనుష్,
ఐశ్వర్య
కలిసి
కెమెరా
వైపు
చిరు
నవ్వు
చిందిస్తూ
కనిపించడం
ఆకట్టుకునేలా
ఉంది.
అతి
కొద్ది
సమయంలోనే
ఈ
ఫొటోలు
నెట్టింట
తెగ
వైరల్
అయ్యాయి.
మళ్లీ కలిసిపోయారా?..
ఈ
పిక్
చూసిన
అభిమానులు
ఉబ్బితబ్బిబ్బయిపోయి
మళ్లీ
వీళ్లిద్దరూ
కలిసిపోయారా?
అంటూ
కామెంట్లు
చేస్తున్నారు.
ఇదిలా
ఉంటే
తెలుగు,
తమిళ
సినిమాలతో
ఫుల్
బిజీగా
ఉన్నాడు
ధనుష్.
ఇటీవలే
తిరు
సినిమాతో
ప్రేక్షకులను
పలకరించాడు.
మరోపక్క
బాలీవుడ్లో
అడుగుపెట్టనుంది
ఐశ్వర్య
రజనీకాంత్.
ఓ
సాథీ
చల్
అనే
లవ్
స్టోరీని
డైరెక్ట్
చేయనుంది.