హీరో ధనుష్ భర్త్ డే పార్టీ, అమలా పాల్ సందడి (ఫోటోస్)
చెన్నై: రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ ఈ రోజు(జులై 28)తో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ధనుష్ నటించిన తమిళ మూవీ 'వేలయ్ ఇల్ల పట్టాతారి' చిత్రం విజయం సాధించ నేపథ్యంలో యూనిట్ సభ్యుల సమక్షంలో ధనుష్ భర్త్ డే పార్టీ వేడుక గ్రాండ్గా సాగింది.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన బిగ్ కేక్ కట్ చేసారు. ఈ బర్త్ డే పార్టీకి ధనుష్ క్లోజ్ ఫ్రెండ్స్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అమలా పాల్, సముద్రఖని తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సంవత్సరం ధనుష్కు ఎంతో స్పెషల్. ఎందుకంటే చాలా కాలం తర్వాత ధనుష్ తమిళంలో హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే రూ. 20 కోట్లు వసూలు చేసింది.
ధనుష్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ధనుష్ బర్త్ డే కేక్
ధనుష్ బర్త్ డే కేక్ ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్ పై అని రూపాన్ని డిజైన్ చేసారు.

భారీ కేక్
మొత్తం 26 కేజీల బరువుతో ఈ కేక్ తయారు చేసారు. ధనుష్ సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో సందిగా ఈ పార్టీ సాగింది.

కేక్ కట్ చేస్తున్న
తన బర్త్ డే సందర్బంగా తయారు చేసిన భారీ కేక్ కట్ చేస్తున్న ధనుష్. చిత్రంలో అమలా పాల్ తదితరులు ఉన్నారు.

సముద్రఖని, అమలా పాల్, ధనుష్
ధనుష్ బర్త్ డే పార్టీలో డైరెక్టర్ సముద్రఖని, అమలా పాల్ తదితరులు పాల్గొన్న దృశ్యం.

దనుస్ నెక్ట్స్ మూవీ
ధనుష్ ప్రస్తుతం బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘షమితాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, అక్షర హాసన్ జోడీగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











