Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉపాసనకు రామ్ చరణ్ ఇచ్చే నిశ్చితార్ద బహుమతి
రామ్ చరణ్ తేజ్, ఉపాసన ల నిశ్చితార్దం డిసెంబర్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్దంకు ఉపాసనకు బహుమతిగా ఇవ్వటానికి ధర్మవరం నుంచి ప్రత్యేకంగా పట్టు చీరను తీసుకువస్తున్నారు. చిరంజీవి అభిమాని అయిన ధర్మవరం పట్టణం కొత్త పేట లోని చేనేత కార్మికుడు అన్వర్ నలబై ఐదు వేలతో ఓ పట్టుచీరను ప్రత్యేకంగా రూపొందించి రెడీ చేసారు. ఈ చీరను ప్రెజెంట్ చేయటానికి ఈ రోజు అంటే సోమవారం హైదరాబాద్ బయిలు దేరి వెళ్తున్నాడు. ఇక ఆయన పెళ్లి కొడుకు రామ్ చరణ్ ని కలిసి ఆ చీరను అందచేయనున్నట్లు తెలిపారు. ఇక నిశ్చితార్దం విషయం తెలియగానే దాదాపు ముప్పై రోజులు పాటు ఆరుగురు కలకత్తాకు చెందిన కళాకారులతో ఈ చీరను రూపొందించారు. ఈ చీరకు స్వర్ణ హంసల పట్టుచీర అని పేరు పెట్టారు. ఈ చీరపై హంసలు బొమ్మలు గల బంగారు పూత డిజైన్లతో, ఎరుపు,పసుపు,తెలుగు రంగులు కల నూట ఎనభై రాళ్లతో చీరను రూపొందించారు. ఇక చీర బోర్డర్ ని కళాంజలి వర్క్ తో ఫినిషింగ్ చేసారు. చీరతో పాటు జాకెట్ పీస్ ని కూడా రెడీ చేసి అందిస్తున్నారు.
ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం.అమితాబ్ ప్రత్యేక అతిధిగా ఈ పంక్షన్ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.