Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పూరి మాస్టర్ ప్లాన్: బిజినెస్ మేన్ తో పాటే ధోనీ
మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన 'బిజినెస్ మేన్' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు దాదాపుగా 2వేల థియేటర్లలో సినిమా ప్రదర్శితం అవుతోంది. ఇన్ని థియేటర్లలో సినిమా విడుదలవుతున్నా....వారం వరకు అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టిక్కెట్లు దొరకక నిరాశ పడ్డారు. బిజినెస్ మేన్ సినిమాకు థియేటర్లు సరిపోలేదు అనడానికి ఇదో నిదర్శనం.
తన కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి ఇదే మంచి సమయం అని ఆలోచించినట్లున్నాడు పూరి జగన్నాధ్. తన తనయుడు ఆకాష్ లీడ్ రోల్ లో నటించిన 'ధోనీ' చిత్ర ట్రైలర్ ను బిజినెస్ మేన్ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తుండటం ధోనీ సినిమాకు ఉన్న మరో ప్లస్ పాయింట్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ విడలవ్వగా...మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బిజినెస్ మేన్ సినిమాతో పాటే ప్రదర్శిస్తే...'ధోనీ' సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ధోనీ చిత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలయరాజా సంగీతం అందించారు. ఈ నెలలోనే చిత్ర ఆడియో విడుదల కానుంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కె.వి.గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.