twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి మాస్టర్ ప్లాన్: బిజినెస్ మేన్ తో పాటే ధోనీ

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన 'బిజినెస్ మేన్' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు దాదాపుగా 2వేల థియేటర్లలో సినిమా ప్రదర్శితం అవుతోంది. ఇన్ని థియేటర్లలో సినిమా విడుదలవుతున్నా....వారం వరకు అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టిక్కెట్లు దొరకక నిరాశ పడ్డారు. బిజినెస్ మేన్ సినిమాకు థియేటర్లు సరిపోలేదు అనడానికి ఇదో నిదర్శనం.

    తన కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి ఇదే మంచి సమయం అని ఆలోచించినట్లున్నాడు పూరి జగన్నాధ్. తన తనయుడు ఆకాష్ లీడ్ రోల్ లో నటించిన 'ధోనీ' చిత్ర ట్రైలర్ ను బిజినెస్ మేన్ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తుండటం ధోనీ సినిమాకు ఉన్న మరో ప్లస్ పాయింట్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ విడలవ్వగా...మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బిజినెస్ మేన్ సినిమాతో పాటే ప్రదర్శిస్తే...'ధోనీ' సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

    ప్రస్తుతం ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ధోనీ చిత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలయరాజా సంగీతం అందించారు. ఈ నెలలోనే చిత్ర ఆడియో విడుదల కానుంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కె.వి.గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.

    English summary
    Prakash Raj's new film Dhoni will have theatrical trailers attached to Businessman releasing today. Film will release actually in February but a trailer is released recently that is getting good response. As Puri's son Akash is acting in lead role, he wanted trailer to be exhibited in his film Businessman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X