Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
విక్రమ్ టీజర్లోనే ఇరుగదీశాడు.. ఇక సినిమా ఏ రేంజో.. హ్యాపీ బర్త్డే చియాన్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ తర్వాత విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న చియాన్ విక్రమ్ జన్మదినం జరుపుకొంటున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ తర్వాత విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న చియాన్ విక్రమ్ జన్మదినం జరుపుకొంటున్నారు. విక్రమ్ జన్మదినం సందర్భంగా ధ్రువ నక్షత్రం చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నది.
ఇండియాకు వచ్చేశాడు..
ధ్రువనక్షత్రం ఒకటో టీజర్లో ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచి రెండో టీజర్లో మొదలైంది. ధ్రువ నక్షత్రం చిత్రంలో విక్రమ్ పాత్ర పేరు జాన్. అమెరికాలో నివసిస్తున్న జాన్ కొన్ని పరిస్థితుల కారణగా దేశ రాజధానికి చేరుకొంటారు. రెండో టీజర్లో అక్కడ నుంచి కథల మొదలవుతుంది. టీజర్లో పెర్ఫార్మెన్స్ చూసిన వారంతా ఈసారి విక్రమ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేయడం ఖాయమనే అభిప్రాయం అప్పుడే ఊపందుకొన్నది.
|
మీనన్ ట్వీట్..
ధ్రువ నక్షత్రం సినిమా రెండే టీజర్ను దర్శకుడు గౌతమ్ మీనన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. విలక్షణ నటుడు విక్రమ్కు జన్మదిన శుభాకాంక్షలు. నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ సినిమాను తెరకెక్కించడంలో నీ పాత్ర గణనీయమైనది అని మీనన్ ట్వీట్ చేశాడు.
రితూ వర్మకు ఛాన్స్
గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నాడు. మీనన్ సినిమాల్లో రాజేశ్ ఉండటం సర్వసాధారణమనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్గా నటించాల్సి ఉండేది. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ చిత్రాన్ని వదులుకొన్నది. ఆమె స్థానంలో పెళ్లిచూపులు ఫేం రితూవర్మకు అవకాశం దక్కింది.
సూర్య స్థానంలో విక్రమ్..
ధ్రువ నక్షత్రం బౌర్న్ సిరీస్ మాదిరిగా తెరకెక్కుతున్నది. వాస్తవానికి సూర్యను హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కిద్దామని గౌతమ్ మీనన్ ప్లాన్ చేవారు. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమ్ ఈ సినిమాలో హీరోగా మారారు. గతేడాది ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను గౌతమ్ విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 80 లక్షల మంది ఈ టీజర్ను వీక్షించడం గమనార్హం.
ఆగస్టులో ధ్రువ నక్షత్రం
ఆన్డ్రాగా ఎంటర్టైన్మెంట్ మరో సంస్థతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికంటే ముందు గౌతమ్ మీనన్ తాను నిర్మిస్తున్న మరో చిత్ర ఎన్నాయ్ నోకి పాయమ్ థొట్టా అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ధనుష్, మేఘా ఆనంద్ నటిస్తున్నారు.