Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వారుసుల రాజ్యం ఏలుతున్న సినీ పరిశ్రమలోనికి మరో వారుసుడు..
వారుసుల రాజ్యం ఏలుతున్న సినీ పరిశ్రమలోనికి మరో వారసుడు అరంగేట్రం చేయనున్నాడు..కాదు కాదు చేసేశాడు..ఇంతకీ ఎవరా వారసుడు అనుకుంటున్నారు..కాదా! మీరు అనుకుంటున్నట్లుగా మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుండి మాత్రం కాదు..డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడు ..'ఆది".
ఆదిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న దర్శకుడు విజయభాస్కర్..చిత్రం పేరు 'ప్రేమ కావాలి". ఈ చిత్రం ప్రముఖ హీరోల సందడి మద్య లాంఛనంగా ప్రారంభమైంది..చిరంజీవి, బాలయ్య, నాగ్, కృష్ణంరాజు, కృష్ణ, హరికృష్ణ, జయసుధ, నాగేశ్వర రావు, రామానాయుడు, కె విశ్వనాథ్ మొదలగు వారంతా..'ఆది"ని ఆశీర్వదించడానికి ఈ చిత్ర ప్రారంబోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు..
ఓ తెలుగు కళామతల్లి..ముద్దుబిడ్డ తన బిడ్డను కూడా కళామతల్లి ఒడికి చేర్చుతున్నాడని..ఇది చాలా గర్వించదగ్గ విషయం అని..ఆదిని అందరూ ఆశీర్వదించి..మంచి హీరోగా నిలబెట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు. బాలయ్య, నాగ్ లు కూడా మంచి హీరోగా ఆది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటాడని..తొలి చిత్రమే మంచి విజయం సాధించి..ఆది..మంచి హీరోగా నిలదొక్కుకుంటాడని..ఆశీర్వదించారు..వీరితో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా ఆదిని ఆశీర్వదించారు.