Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
RRR పై స్పందించిన మరో రైటర్.. ఆ విషయంలో భయం అక్కర్లేదంటూ..
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం రోజురోజుకు అంచనాల డోసును అమాంతంగా పెంచేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలని బయటపెట్టిన విషయం తెలిసిందే. సినిమాలో అలియా భట్ పాత్ర హైలెట్ అంటూ హీరోల ఎమోషనల్ ఫైట్ గురించి కూడా రివీల్ చేసేశారు. ఆ దెబ్బతో సినిమాకు ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే తరహాలో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిజానికి అభిమానుల్లో కొంత ఆందోళన అయితే ఉంది. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తారా లేదా అనే ప్రశ్నపై సాయి మాధవ్ క్లారిటిగా వివరణ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని దర్శకుడు రాజమౌళి కథను చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో ఊహించానని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను సమానంగా ప్రజెంట్ చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా సినిమా ఒక అద్భుతం అని అంతకంటే మరొక మాట చెప్పలేనని కూడా సాయి మాధవ్ తెలియజేశారు.