Don't Miss!
- News తెలంగాణాలో ద్రోణి ప్రభావం: మూడురోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
RRR పై స్పందించిన మరో రైటర్.. ఆ విషయంలో భయం అక్కర్లేదంటూ..
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం రోజురోజుకు అంచనాల డోసును అమాంతంగా పెంచేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలని బయటపెట్టిన విషయం తెలిసిందే. సినిమాలో అలియా భట్ పాత్ర హైలెట్ అంటూ హీరోల ఎమోషనల్ ఫైట్ గురించి కూడా రివీల్ చేసేశారు. ఆ దెబ్బతో సినిమాకు ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే తరహాలో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిజానికి అభిమానుల్లో కొంత ఆందోళన అయితే ఉంది. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తారా లేదా అనే ప్రశ్నపై సాయి మాధవ్ క్లారిటిగా వివరణ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని దర్శకుడు రాజమౌళి కథను చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో ఊహించానని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను సమానంగా ప్రజెంట్ చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా సినిమా ఒక అద్భుతం అని అంతకంటే మరొక మాట చెప్పలేనని కూడా సాయి మాధవ్ తెలియజేశారు.