Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
RRR పై స్పందించిన మరో రైటర్.. ఆ విషయంలో భయం అక్కర్లేదంటూ..
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం రోజురోజుకు అంచనాల డోసును అమాంతంగా పెంచేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలని బయటపెట్టిన విషయం తెలిసిందే. సినిమాలో అలియా భట్ పాత్ర హైలెట్ అంటూ హీరోల ఎమోషనల్ ఫైట్ గురించి కూడా రివీల్ చేసేశారు. ఆ దెబ్బతో సినిమాకు ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే తరహాలో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిజానికి అభిమానుల్లో కొంత ఆందోళన అయితే ఉంది. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తారా లేదా అనే ప్రశ్నపై సాయి మాధవ్ క్లారిటిగా వివరణ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని దర్శకుడు రాజమౌళి కథను చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో ఊహించానని, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను సమానంగా ప్రజెంట్ చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా సినిమా ఒక అద్భుతం అని అంతకంటే మరొక మాట చెప్పలేనని కూడా సాయి మాధవ్ తెలియజేశారు.