Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్
హైదరాబాద్ : గత కొంతకాలంగా ఎన్టీఆర్ హీరోగా.., వక్కంతం వంశీ దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ చిత్రం రాబోతోందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ విషయం ఖరారు చేస్తూ పోస్టర్స్ సైతం వేసారు. అయితే అంతా ఖరారు అనుకున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. వక్కంతం సైడ్ లైన్ అయ్యారు. దీనికి కారణం ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. కానీ తాజాగా కళ్యాణ్ రామ్ ఈ విషయమై మాట్లాడారు.
వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేశాం అని తేల్చి చెప్పారు హీరో కళ్యాణ్ రామ్.
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లోనే బిగెస్ట్ బడ్జెట్ తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని క్లియర్ చేసారు.
ఇక ఇజం చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని పక్కాగా రెడీ అయిపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్గా నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.
కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్గా కనిపించనున్న 'ఇజం', ఇంటర్నేషనల్ బ్లాక్మనీ అనే అంశంపై తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.