Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాహుబలి బ్లాక్ : ప్రేక్షకుల తీరును తప్పుబట్టిన దిల్ రాజు
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతుందన్న విషయం గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు స్పందించారు. టికెట్స్ ఎవరూ బ్లాక్ చేయలేదని, బయట ఎవరైనా టికెట్స్ బ్లాక్ లో అమ్మితే కొనవద్దని సూచించారు.
సినిమాకు టికెట్లకు భాగా డిమాండ్ ఉన్న విషయమై దిల్ రాజు స్పందిస్తూ.... ప్రేక్షకులను బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు. టికెట్ల కోసం మరొక రోజు ప్రయత్నించండి, ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సినిమా విడుదలైంది. మీరు అనుకున్న రోజే సినిమా టికెట్స్ దొరకాలంటే ఎలా అనే విధంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.
కాగా...బాహుబలి సినిమా బ్లాక్ టికెట్స్ విషయంలో ఇప్పటికే పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను మీడియా వారు
ఇక ‘బాహుబలి' సినిమా గురించి మాట్లాడుతూ....తెలుగులో హాలీవుడ్ స్థాయిలో ‘బాహుబలి' సినిమా రావడం గర్వంగా ఉంది. ఒక తెలుగు వ్యక్తి ప్రపంచ స్థాయి సినిమా తీయడం, ఆ సినిమాకు నేను నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉండటం హ్యాపీగా ఉందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.