Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కంటెంట్, కాస్టింగ్ రెండూ మైనస్లే: దిల్ రాజు
ఇంకా ఆయన చెబుతూ- "రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నా.. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందీ సినిమా. టెక్నీషియన్స్ కూడా అందరూ ఉద్దండులే. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎపిసోడ్స్ ఇందులో చాలా ఉంటాయి. హీరోహీరోయిన్ల నేపథ్యాలు కూడా కొత్తగా ఉంటాయి. అందుకే ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది హిట్ల తర్వాత వస్తున్న తొమ్మిదో హిట్ ఈ సినిమా అని మీడియా సాక్షిగా చెప్పేశాను. ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది'' అన్నారు దిల్ రాజు.
"అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా పూర్తయిన తరవాత ఎందుకో ఆ సినిమాపై నాకే కొన్ని సందేహాలు వచ్చాయి. వెంటనే ఎమ్మెస్ రాజుకి చూపించాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. దాంతో.. సినిమా బాగా వచ్చింది. 'తూనీగ తూనీగ'కూ అలాంటి సమస్యే ఎదురైంది. నాకు ఈ సినిమా చూపించినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. ఈ మధ్యలోనే కాస్త లోటు అనిపించింది. ఆ సంగతే చెబితే, మళ్లీ ఓ వారం షూటింగ్ చేసి చూపించారు. అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది" అన్నారు.
"అలాగే సుమంత్ అశ్విన్ అనుభవం ఉన్న హీరోలా చాలా ఈజ్తో చేశాడు. వెంకటేశ్, అల్లు అర్జున్ తర్వాత ఓ నిర్మాత కొడుకుగా సుమంత్ అశ్విన్ హీరోగా సెటిల్ అవుతాడు. నేను చెప్పింది నిజమని సినిమా విడుదలైన రోజు ప్రేక్షకులు ఏకీభవిస్తారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్టయ్యాయి. కొడుకును పరిచయం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెస్ రాజు రెట్టింపు కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యాక మా బేనర్లోనే అశ్విన్తో రెండో సినిమా చేస్తాం'' అని చెప్పారు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: ఎస్.గోపాల్రెడ్డి, కథ, స్క్రీన్ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.